ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో బుల్లి తెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఛానల్ స్టార్ మా .
అయినా సరే స్టార్ మా ఏ దేవి వరమో నీవు అనే సరికొత్త సీరియల్ ను ఈ రోజు రాత్రి 8.30 ల సమయానికి ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం వస్తోన్న ఇంటింటి రామాయణం సీరియల్ ను సాయంత్రం ఆరుగంటలకు ప్రసారం చేయనున్నారు. ఆరు గంటలకు వస్తోన్న నిండు మనసులు సీరియల్ ను మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం చేస్తున్నారు. వారసురాలు సీరియల్ ను రెండు గంటలకు ప్రసారం చేస్తున్నారు. రెండు గంటలకు ప్రస్తుతం వస్తోన్న సప్తపది సీరియల్ ను ఆపేసారు
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో టి ఆర్ పి రేటింగ్స్ ను నిలిపి వేసింది బార్క్ సంస్ధ. అనాధగా పెరిగిన అమ్మాయి తన తల్లిని కలుసుకోవడానికి పడే ఆరాటం, పోరాటమే ఈ ఏ దేవి వరమో నీవు సీరియల్
ఈ సీరియల్ కు సంబంధించి స్టార్ మా వారు నటి సంజన మరియు కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఒక ఫన్నీ ప్రోమో చేశారు. మీరు కూడా చూడండి.

