‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్​ జాతర

by | Mar 4, 2025 | సినిమా

‘సంక్రాంతికి వస్తున్నాం’ 50డేస్​ జాతర.. అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా!

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించగా.. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న రిలీజైన ఈ సినిమా వరల్డ్​ప్రపంచవ్యాప్తంగా​గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దాంతో హీరో వెంకటేష్ కెరీర్​లో కలెక్షన్ల పరంగా అతి పెద్ద సినిమాగా అవతరించింది. ఇందులో వెంకీ (Venkatesh) నటనకు, కామెడీ టైమింగ్ ​కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వారి ఈలలు, చప్పట్లతో థియేటర్లు దద్దరిల్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్​లోనూ ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) మూవీ ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఒక సినిమా నాలుగు వారాలు థియేటర్లలో ఉండడమే కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఏకంగా 92 సెంటర్లలో 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘనత సాధించడమనేది గొప్ప విషయమనే చెప్పాలి. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమా మార్చి 1న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ అరుదైన రికార్డ్ ఖాతాలో వేసుకుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 (ZEE5) హిస్టరీలోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్‌ సాధించిన మూవీగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఘనత సాధించింది. కాగా, ఈ మూవీ జీ5లో తెలుగుతో పాటు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.