ప్రభాస్ తో హీరోగా తీసిన సాలార్ లో మలయాళ స్టార్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ని రంగంలోకి దింపారు మన దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సారి ఎన్టీఆర్ తో తీయబోయే సినిమాలో మరో మలయాళ నటుడు టొవినో థామస్ ని రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రశాంత్ నీల్
మిన్నల్ మురళి, 2018, ఎ ఆర్ ఎమ్ చిత్రాలతో టొవినో థామస్ మలయాళంలో బాగా పాపులర్ అయ్యాడు. ఇందులో 2018, ఎ ఆర్ ఎమ్ చిత్రాలు మా టీవీ లో ప్రసారమయ్యాయి
ప్రశాంత్ నీల్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉంటుంది. అయితే యాక్షన్ సినిమాలు తీసే ప్రశాంత్ నీల్ ఈ సారి ఎన్టీఆర్ ని ఎలాంటి మాస్ యాక్షన్ క్యారెక్టర్ లో చూపిస్తారో చూడాలి. కెజిఫ్, సలార్ సినిమాలు ఇప్పటికి యాక్షన్ ప్రేక్షకులను అలరిస్తాయి. సరి కొత్త డార్క్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించడం ప్రశాంత్ నీల్ ప్రత్యేకత. మరి ఈ సారి కూడా కెజిఫ్, సలార్ సినిమాల లాగా డార్క్ బ్యాక్ డ్రాప్ థీమ్ తో తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి. అతి త్వరలో ఎన్టీఆర్ అభిమానులను కలుసుకోబోతున్నాడు. కాబట్టి ఆ ఫ్యాన్ మీట్ లో ఎన్టీఆర్, అభిమానులకు ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటాడో చూడాలి

