ఎగ్జిట్ పోల్స్ లో ఢిల్లీ పీఠం భాజపా కే

by | Feb 5, 2025 | రాజకీయాలు

అన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు, స్పష్టమైన మెజారిటీ తో, భాజపా అధికారం లో కి వస్తుందని చెపుతున్నాయి. ప్రస్తుతరం అధికారం లో ఉన్న ఆప్ 20-30 స్థానాలు గెలుచుకుంటుందని, మరో సారి కాంగ్రెస్ కు ఘోర పరాభవం తప్పదు అని ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి

 AAPBJPCongress
Republic P Mark21-3139-490-1
Times Now22-3139-450-2
Peoples Pulse10-1951-600
Chanakya Strategy25-2839-442-3
JVC Exit Poll22-3139-450-2
ABP Matriz Exit Poll32-3735-400-1
Peoples Insight25-2940-440-1
CNN26440

భాజపాకు ఎగ్జిట్ పోల్స్ లో స్పష్టమైన మెజారిటీ రావడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటి

  • ఢిల్లీ లో పోలింగ్ శాతం పెరగడం భాజపా కు అనుకూలంగా మారిందని చెప్పవచ్చు.
  • కలుషిత నీరు,  అస్తవ్యస్తమైన రోడ్లు,  ఆప్ అవినీతి వంటి అంశాలు ఆప్ పట్ల  ఓటర్లు అసంతృప్తిగా ఉండవచ్చు. 
  • కేంద్రంలో అధికారం లో ఉన్న భాజపా కు ఓటు వేస్తే అభివృద్ధి జరగవచ్చు అన్న అభిప్రాయానికి రావచ్చు
  • ఇప్పటిదాకా కాంగ్రెస్, ఆప్ పార్టీ లకు వరస అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ ఓటర్లు ఈ సారి భాజపాకు అవకాశమిచ్చారని ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం గా చెపుతున్నాయి 
  • బడ్జెట్ లో 12 లక్షల వరకు  ఆదాయం ఉన్న ఉద్యోగులకు,   ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుందని ప్రకటించడం భాజపా కు కలసి వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటె ఢిల్లీ మధ్య తరగతి ప్రజలు 60% ఉన్నారు
  • 10 సంవత్సరాలు అధికారం లో ఉన్నా వాయు కాలుష్యం నివారణకు ఆప్ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోవడం
  • ప్రతి దానికి అభివృద్ధి కి గవర్నర్, భాజపా సహకరించడం లేదని వారిపై నిందలు వేయడం

మహాకుంభమేళా లో ప్రధాన మంత్రి మోడీ చేసిన పూజలు నిజంగా ఫలించాయి అని చెప్పవచ్చు. 

అయితే ఫిబ్రవరి 8 న కౌంటింగ్ జరగనుంది.  ఏమైనా సంచలనాలు జరుగుతాయా లేదా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అందుకుంటాయా అనేది వేచి చూడాలి