యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘డ్రాగెన్’ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. పక్కా యాక్షన్ బ్యాక్డ్రాప్తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్స్ లో హీరో ఎన్టీఆర్ ఏప్రిల్ 22 నుంచి పాల్గొననున్నారు. అయితే ఇప్పటివరకు వచ్చిన రషెస్తో రిలీజ్కు ముందే ఈ మూవీ సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ మూవీ గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట సందడి చేస్తోంది.
తాజాగా ఈ సినిమాలోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్సింగ్ డ్రాగెన్ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ కి ఏమాత్రం తగ్గకుండా రణవీర్సింగ్ రోల్ను ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డిజైన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ రణవీర్సింగ్కు బాగా నచ్చిందని, దాంతో ఈ మూవీ చేసేందుకు ఆయన ఆసక్తిని చూపించారని అంటున్నారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ – రణవీర్సింగ్ మధ్యలో కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని చెబుతున్నారు. ఇదిలాఉంటే.. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ శ్రీలంకకు వెళ్లనుంది. అక్కడి లొకేషన్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నారు. అలాగే ఓ భారీ రిస్కీ ఫైట్ ను కూడా షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీలంక షెడ్యూల్లో హీరో ఎన్టీఆర్ (NTR) కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

