టీవీ లో అనేక రకాల కార్యక్రమాలు వస్తున్నాయి, ఓ టి టి అనేక రకాల వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఓ టి టి లో ఎక్కువగా ప్రేక్షకులు సినిమాలనే చూస్తున్నారు. అయితే ఈ మధ్య కొన్ని విభిన్న వెబ్ సిరీస్ లకు ఓ టి టి లో ఆదరణ లభిస్తోంది
అయితే ఇటీవల సోనీ లివ్ లో విడుదలైన ‘మయసభ’ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ రివ్యూ లు కూడా బాగున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిన ఈ మయసభ వెబ్ సిరీస్ ని దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించాడు.
అది పినిశెట్టి, చైతన్య రావు లు ప్రధాన పాత్రలలో నటించిన ఈ మయసభ వెబ్ సిరీస్, ఆగష్టు 7 న సోనీ లివ్ లో విడుదలై, ఒక సరి కొత్త రికార్డు ను సృష్టించింది.
భారత దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన షో ల కు సంబదించిన మొదటి 5 స్థానాలలో, ఈ మయసభ కూడా ఉంది. ఒక తెలుగు షో టాప్ 5 లో కి రావడం ఇదే మొదటి సారి, ఈ విషయాన్నీ సోనీ లివ్ వారి ఎక్స్ వేదికగా ప్రకటించారు.


