కటక్ వన్ డే : భారత లక్ష్యం 305 పరుగులు

by | Feb 9, 2025 | వార్తలు

భారత, ఇంగ్లాండ్ జట్ల మధ్య కటక్ లో జరుగుతోన్న రెండవ వన్ డే లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.  ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్ ల లో 304 పరుగులు చేసింది

ఓపెనర్ లు ఫీల్ సాల్ట్, డకెట్ లు మొదటి వికెట్ కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇంగ్లాడ్ జట్టు ఓపెనర్లు సాల్ట్, డకెట్ లు వికెట్ కాపాడుకుంటూ, స్కోర్ బోర్డు ను పరిగెత్తిస్తోన్న తరుణంలో, మొదటి మ్యాచ్ ఆడుతోన్న వరుణ్ చక్రవర్తి, సాల్ట్ వికెట్ పడగొట్టి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు 

సాల్ట్ 26 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అవుట్ అవగా, మరో ఓపెనర్ డకెట్ 65 పరుగులతో రాణించాడు. ప్రమాదంగా మారుతున్న తరుణం లో డకెట్ ను జడేజా అవుట్ చేశాడు.

సీనియర్ బ్యాట్స్ మాన్ జో రూట్ నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డు ను నడిపించాడు. 69 పరుగులు చేసిన జో రూట్ ను కూడా జడేజా అవుట్ చేశాడు

తడబడుతూ ఆడిన బ్రూక్ 52 బంతుల్లో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  కెప్టెన్ బట్లర్ 34 పరుగులు చేసి నౌట్ అయ్యాడు

భారత బౌలర్ ల లో జడేజా (10-1-35-3)పొదుపుగా బౌలింగ్ చేసి కీలకమైన 3 వికెట్లు తీశాడు.  షమీ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ తీశారు.  ముగ్గురు బ్యాట్స్ మన్ లు రన్ అవుట్ అయ్యారు