పీఎం మోడీ కి ధన్యవాదాలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి
భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చడమే లక్ష్యం గా ఈ సంవత్సరం చివరిలో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(WAVES) ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే
ఈ నేపథ్యంలో కొంత మంది సీనియర్ నటులు, వ్యాపార వేత్తలతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమ్మిట్ నిర్వహణకు సంబంధించి వీరి సలహాలు, సూచనలు తీసుకున్నారు.











