ఛాంపియన్స్ ట్రోఫీ సెమి ఫైనల్ : ఆస్ట్రేలియా పై భారత్ విజయం
ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియా పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగు పెట్టింది. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే భారత జట్టు లక్ష్యాన్ని చేధించింది
265 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మొదట్లోనే శుభ్ మన్ గిల్ వికెట్ ను కోల్పోయింది. 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా అవుట్ కావడంతో 43 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడినట్లు అనిపించింది












