జన్మనిచ్చి, పెంచి, పెద్ద చేసిన తల్లి తండ్రుల బాధ్యత పిల్లలదేనని (కొడుకైన కూతురైన) సుప్రీమ్ కోర్ట్ స్పష్టం చేసింది.
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో, కొంత ఆస్తి తీసుకున్నాక తల్లి తండ్రులను విస్మరించిన కొడుకు కు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం స్పష్టం చేసింది. ఇంతకు ముందు కొడుకు కు ఇచ్చిన అస్తి మీద, తిరిగి తల్లి తండ్రులకు యాజమాన్య హక్కులు వచ్చేలా తీర్పు ఇచ్చింది












