ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్ లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది
మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ధాటిగానే ఆరంభించింది. మొదటి వికెట్ కు విల్ యంగ్, రచిన్ రవీంద్రలు 57 పరుగులు జోడించారు. 15 పరుగులు చేసిన విల్ యంగ్ అవుట్ అయిన తరవాత క్రమం తప్పకుండా న్యూజిలాండ్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. న్యూజిలాండ్ కీలక ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, విలియమ్సన్ లను స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెంట వెంట ఓవర్ లలో అవుట్ చేశాడు.
ఆ తర్వాత వచ్చిన టామ్ లేధం కూడా 14 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 108 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టును మిచెల్, ఫిలిప్స్ లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదవ వికెట్ కు 57 పరుగులు జోడించారు. 34 పరుగులు చేసిన, ఫిలిప్స్ ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు
మిచెల్, బ్రేస్ వెల్ లు ఆరవ వికెట్ కు 46 పరుగులు జోడించారు. 101 బంతుల్లో 63 పరుగులు చేరిన మిచెల్ ను షమీ అవుట్ చేశాడు. ఆ తరవాత వచ్చిన కెప్టెన్ సాంట్నర్ తో జత కలిసిన బ్రేస్ వెల్ స్కోర్ బోర్డు ను మెల్లి మెల్లిగా కదిలిస్తూ వచ్చారు.
బ్రేస్ వెల్ బ్రేస్ వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్ల లో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా, జడేజా, షమీ లు చెరో వికెట్ తీశారు
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్రధాన బౌలర్ హెన్రీ ఆడక పోవడం భారత్ కు కలిసి వచ్చే అంశం

