1982, మార్చ్ 29 న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు దేశం పార్టీ ని స్థాపించారు. తెలుగు వారి ఆత్మ గౌరవం అంటూ తెలుగు దేశం పార్టీ ని స్థాపించిన 9 నెలలలోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు నందమూరి తారక రామారావు గారు
తెలుగు దేశం పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ప్రత్యేక వీడియో ని విడుదల చేసింది. ఈ వీడియోలో 1982 నాటి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి తరం నారా లోకేష్ యువగళం పాదయాత్ర వరకు అన్నిటిని పొందుపరిచారు. ఈ వీడియో ను పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో ప్రదర్శించారు
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులూ ఒకసారి తెలుగు దేశం ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు.

