‘కింగ్​డమ్​’ లేటెస్ట్ బజ్.. రెండు పార్ట్​లుగా విజయ్ మూవీ?

by | Mar 21, 2025 | సినిమా

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్​డమ్​’. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్‌ దేవరకొండ క్యారెక్టరైజేషన్‌లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ టైటిల్‌కు తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో వినిపించిన డైలాగ్​లు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లుక్, గెటప్ అన్నీ అక్కట్టుకునేలా ఉన్నాయి. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

అయితే ‘కింగ్​డమ్​’ (Kingdom) సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. మొదటి భాగం ఈ ఏడాది మే 30న, రెండో పార్ట్ ఆ తర్వాత రిలీజ్ అవుతుందని టాక్. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ అంశంపై ఇటీవల మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్‌లో ప్రొడ్యూసర్ నాగవంశీ మాట్లాడుతూ కీలక కామెంట్లు చేశారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే కింగ్​డమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. కింగ్‌డమ్ స్టోరీ రెండు భాగాలుగా దర్శకుడు నాకు చెప్పాడు. అయితే గౌతమ్ ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడు, సెకండ్ పార్ట్‌కు వేరే స్క్రీన్‌ప్లే ఉంటుందని చెప్పాడు. అయితే, ఈ మూవీ సెకండ్ పార్టుకు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. తొలి భాగం హిట్ అయితే సీక్వెల్ తీసే అంశంపై నిర్ణయం తీసుకుంటాం.” అంటూ నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. కాగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.