మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ కేజీఎఫ్, సలార్ మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్'(Dragon) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పక్కా యాక్షన్ బ్యాక్డ్రాప్తో రానున్న ఈ సినిమాలో ‘సప్త సాగరాలు దాటి’ మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నారు. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ భాగమవుతున్నారనే వార్తలు మరింత అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన నాటినుంచి అభిమానులు దీని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను నిర్మాతలు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ లోనే రెండు వారాల పాటుగా షూటింగ్ జరగనుందట. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రల మధ్య కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు హీరో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ పాత్ర మీద ఓ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీయనున్నారని తెలుస్తోంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్ సారథ్యంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట. సినిమాలో ఈ సీక్వెన్స్ మేజర్ హైలెట్గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram), నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచలి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

