గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షూటింగ్ దశలో ఉండగానే ఆర్సీ16 కోసం పలు బడా సంస్థలు కోట్లల్లో ఆఫర్ చేస్తున్నారట. అంతేకాకుండా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందట. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఈ సినిమా కోసం భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నాయట. ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ సంస్థ (Sony Live) ఈ సినిమాకి రికార్డు మొత్తంగా రూ. 200 కోట్లు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ సినిమా నిర్మాతలు మాత్రం దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతుందో గానీ, రూ. 200 కోట్ల నంబర్ మాత్రం రామ్ చరణ్ (Ram Charan) రేంజ్ ఏంటో అని స్పష్టం చేస్తుంది. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ చక్రవర్తి శివరాజ్కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ప్రస్తుతం ‘ఆర్సీ 16’ మూవీ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైద్రాబాద్లో సోమవారం రాత్రి మొదలైనట్లు తెలుస్తోంది. హైద్రాబాద్లో శివార్లలో వేసిన ప్రత్యేక సెట్స్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు సమాచారం.
హీరో రామ్ చరణ్(Ram Charan) , హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్య కొన్ని సీన్స్ను షూట్ చేయనున్నారని సమాచారం. సాధ్యమైనంత వరకు చిత్రీకరణ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, మార్చి 27న రామ్చరణ్ పుట్టినరోజు కానుకగా టైటిల్, టీజర్ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా ఉన్నారు.

